ఏపీఎల్లో నేడు డబుల్ ధమాకా
కడప వేదికగా రెండు ఆసక్తికర పోరులు
తొలి మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భీమవరం బుల్స్
స్టేడియంకు పోటెత్తుతున్న క్రికెట్ అభిమానులు
(కడప, ఆంధ్రప్రభ): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో రోజు పోటీలు కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. లీగ్కు రోజురోజుకు అభిమానుల ఆదరణ పెరుగుతుండగా, గురువారం డబుల్ హెడర్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన తొలి మ్యాచ్లో భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని విజయవాడ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
రాత్రి 7 గంటలకు జరిగే రెండో మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ కూడా కీలకంగా మారింది.
ఏపీఎల్ పోటీలకు రోజురోజుకు ప్రేక్షకుల స్పందన పెరుగుతోంది. వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆటతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నేడు ప్రముఖ సెహరీ బ్యాండ్ తమ సంగీత ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది.
లీగ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత పోటీలు, వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకర్షిస్తుండటంతో ఏపీఎల్-2026 విజయవంతంగా కొనసాగుతోంది.
