వెలగపూడి – భారత్ జోలికి ఎవరైనా వస్తే మటాష్ అయిపోతారని, భారత్ను ఉగ్రవాదం ఏం చేయలేదని సీఎం చంద్రబాబు అన్నారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన దారుణమైందని అన్నారు.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు సంఘటితంగా ఉండాలని, తీవ్రవాదం సమస్యలు భారత్ను ఏం చేయలేవని పేర్కొన్నారు..
అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న ‘వి లాంచ్పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమానికి నేడు హాజరైన ముఖ్యమంత్రి ముందుగా యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని, నూతన భవనాలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా ఎఐ దేనని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత తీసుకొచ్చామన్నారు. స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు.
హైదరాబాద్ లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని, భవిష్యత్ అంతా ఐటీ )దేనని అపట్లో పిలుపు ఇచ్చానని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడికెళ్లిన భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారుని అన్నారు. తెలుగువాళ్ల జనాభా 5 శాతమే.. ఐఐటీల్లో సీట్లు మాత్రం 20 శాతం మనోళ్లవే అని వ్యాఖ్యానించారు.
మే 2న ఏపీకి ప్రధాని..
మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికే డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.