స్పాట్ లోనే అయిదుగురు దుర్మరణం
చంద్రగిరి వద్ద ఘటన
మృతులందరూ తమిళనాడు వాసులే
తిరుపతి – తిరుపతి జిల్లాలో నేడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. చంద్రగిరి నియోజకవర్గంపాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడుకు చెందిన వీరంతా కారులో తిరుమలకు బయలుదేరారు. అయితే పాకాల వద్ద కారు ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీట్టింది. ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.