చంద్రగిరిలో భక్తుల సందడి
తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి(Sri Kodandaramaswamy) ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఈ రోజు పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ(Seethalakshmana) సమేత శ్రీరాములెరి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ, కుంభారాధన, హోమం, లఘు పూర్ణాహుతినిర్వహించారు.
ఉదయం 9 గంటల నుండి యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ భక్త ఆంజనేయస్వామి(Sri Bhakta Anjaneyaswamy), శ్రీ విష్వక్సేనులకు, శ్రీ గరుడాళ్వార్కు(Sri Garudalwar), యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని యాగశాల(Yagashala)లో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ జ్ఞానప్రకాష్(Gnanaprakash), టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని హరిబాబు, అధికారులు పాల్గొన్నారు.