ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టిస్తోంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలు రావడంతో స్పాట్లోనే 12 మంది మృతి చెందారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంకా కొందరు మృతి చెందడం లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుకున్న తర్వాత ఆర్మీ, ఎన్డీఆర్ఫ్, ఎస్డీఆర్ఎఫ్(Army, NDRF, SDRF) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో భారీ వర్షాలు..
ఢిల్లీలో భారీ వర్షాలు(Heavy rains Delhi), వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. భారీ వర్షం, వరద నీటిలో ఢిల్లీ మునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకోవడం, ఇళ్లు కూలిపోవడం, రహదారులు మూసుకుపోవడం వంటివి చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో మునిగిపోయి, విద్యుత్ షాక్లకు గురై, కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింద చిక్కుకొని మరికొందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వర్షాల వల ఆస్తులు, పంట నష్టం భారీగా సంభవిస్తుందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేస్తున్నా.. ప్రాణ నష్టం మరింత పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం ఎదురుచూసే ప్రజల బాధ వర్ణనాతీతగా ఉంది. తాజాగా దేశ రాజధానిలో వర్షం వల్ల చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తుల ప్రాణాల మీదకు వచ్చింది.
చెట్టు కూలి వ్యక్తి మృతి..
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కల్కాజీ ఏరియాలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు బైకు, కారుపై ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చెట్టును కట్ చేసే లోపు బైక్పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కూలిపోయిన చెట్టు కింద కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు ప్రమాదంపై సమాచారాన్ని పోలీసులు వెంటనే అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.