AP CM : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపు సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఒక్కరోజు విరాళం అందించనున్నారు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షలు…
దీనికి అవసరమైన ఒకరోజు మొత్తం ఖర్చు 44 లక్షల రూపాయలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు. ఈసందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా నారా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు మొత్తం అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం టీటీడీకి అందజేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *