భారత షట్లర్లకు కఠిన ‘డ్రా’

పేలవ ఫామ్ లో సింధు, లక్ష్య సేన్..

వరల్డ్ చాంపియన్ షిప్స్

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్స్ (Badminton World Championships) భారత షట్లర్ల (Indian shuttlers)కు కఠిన సవాళ్లు ఎదురు కానున్నాయి. ఈ నెల 25 నుంచి 31 వరకు జరిగే మెగా టోర్నీ డ్రాను విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ లక్ష్య సేన్ (Lakshya Sen) కు తొలి రౌండ్లోనే వరల్డ్ నెం:1 షి యు కి (చైనా) రూపంలో గండం ఎదురు కానుంది. పారిస్ ఒలింపిక్స్ సెమీస్ ఓటమి తర్వాత లక్ష్య సేన్ మళ్లీ పుంజుకోలేకపోయాడు. 2021 ప్రపంచ చాంపియన్షిప్స్ సేన్ కాంస్యం సాధించాడు. మరో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఫామ్ లో లేడు. తొలి రౌండ్ గట్టెక్కినా.. రెండో రౌండ్లో వరల్డ్ నెం: 2 ఆండ్రెస్ అంటాన్సెన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. కాగా, 2019 చాంపియన్ పీవీ సింధు మాత్రమే మహిళల సింగిల్స్ (first round) లో భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తోంది. తొలి రౌండ్లో కలో యనా నల్బంటోవా (బల్గేరియా)తో సింధు తలపడనుంది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న సింధు.. ప్రీక్వార్టర్స్ లో రెండో సీడ్వాంగ్ జి యి (చైనా)ను ఢీకొనాల్సి రావచ్చు. ఈ టోర్నీలో సింధు స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్ క్వార్టర్స్ చేరడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. కాగా, పురుషులు డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి జంటకు తొలి రౌండ్ బై లభించింది. మహిళల డబుల్స్లో ట్రీసా జాలీ- గాయత్రి జోడీ టోర్నీ నుంచి తప్పుకోగా.. రితుపుర్ణ-శ్వేతపర్ణ, ప్రియ కొన్ జెంగ్ బ‌మ్ శ్రుతి మిశ్రా జంటలు బరిలో నిలవనున్నాయి.

Leave a Reply