అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రమాదస్థలం నుండి స్వాధీనం చేసుకున్న రెండు బ్లాక్బాక్స్లు – ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) – డేటా డౌన్లోడ్ ప్రక్రియ జూన్ 25న విజయవంతంగా పూర్తయ్యింది. ఈ డేటా ప్రస్తుతం ఢిల్లీలోని ఏఎఐబీ ప్రత్యేక ప్రయోగశాలలో విశ్లేషణలో ఉంది.
ఈ దర్యాప్తు ICAO మార్గదర్శకాలను అనుసరిస్తూ జరుగుతోంది. జూన్ 13న నియమితమైన ప్రత్యేక దర్యాప్తు బృందంలో విమానయాన నిపుణులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు, అలాగే అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సభ్యులు కూడా ఉన్నారు.
టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాల్లోనే ప్రమాదం ఎలా జరిగింది? పైలట్ల మధ్య సంభాషణలేమిటి? సాంకేతిక లోపాలు ఉన్నాయా? వంటి కీలక విషయాలపై స్పష్టత కోసం బ్లాక్బాక్స్ డేటా విశ్లేషణ చాలా ప్రాముఖ్యంగా మారింది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, బ్లాక్బాక్స్ డేటా ఆధారంగా 30 రోజులలోపు ప్రాథమిక నివేదికను విడుదల చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. అయితే పూర్తి నివేదిక సిద్ధమవ్వడానికి మరికొంత సమయం పడే అవకాశం ఉంది.