వెలగపూడి – మధుర మీనాక్షి (Madhura Meenakshi) అమ్మవారి పవిత్రమైన భూమి మధురైకి, అలాగే శక్తి స్వరూపుడు మురుగన్ (muragan ) నేల తమిళనాడు (tamilanadu ) మట్టికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు (Thanks ) తెలియజేశారు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ (pawan kalyan ) . మధురైలో ఆదివారం నాడు నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. మీరు చూపిన ప్రేమ, భక్తి నాకు అపూర్వ అనుభూతిని కలిగించాయని.. ఈ పవిత్ర భూమి(Holi land) , ఇక్కడి ప్రజలు ధార్మిక భారతదేశ జీవరూపమే అని అన్నారు.
అలాగే “మురుగన్ భక్తర్గళ్ మానాడు” కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరైన ప్రతి భక్తుడికీ నా కృతజ్ఞతలు. ఈ సమ్మేళనంలో మీ అందరి ఉనికి ఒక దైవానుగ్రహంగా భావించాలి. ఈ భూమి ధర్మ పథాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆదర్శ ప్రదేశంగా నిలిచిందని అన్నారు. ఈ ఘన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా తమిళనాడు అధ్యక్షులు తిరు కడేశ్వర సుబ్రహ్మణ్యం అవర్గళ్, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు తిరు నైనార్ నాగేంద్రన్ అవర్గళ్, మాజీ అధ్యక్షుడు తిరు అన్నామలై అవర్గళ్, కేంద్ర మంత్రి తిరు ఎల్. మురుగన్ అవర్గళ్, మాజీ తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అవర్గళ్, సీనియర్ రాజకీయ నాయకుడు తిరు కే.ఎస్. రాధాకృష్ణన్ అవర్గళ్, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని మత గురువులు, సన్యాసులు, ఇతర గౌరవనీయ అతిథులు, భక్తులకు నా హృదయపూర్వక నమస్సులంటూ పేర్కొన్నారు.