AP | ప్ర‌తిప‌క్షంలోనూ మారని జ‌గ‌న్ వైఖ‌రి : క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

అమరావతి: ప్రతిపక్షంలోనూ ఏపీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అరాచక వైఖరి మారలేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య (Nagamalleshwara Rao commits suicide) చేసుకున్నారని, నాగమల్లేశ్వరరావు చనిపోయింది గతేడాది జూన్ 9న అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది గతేడాది జూన్ 12 తేదీన అని చెప్పారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య అంటూ వైసీపీ దుష్రచారం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) దుయ్యబట్టారు.

Leave a Reply