అన్నపురెడ్డిపల్లి, మే 15( ఆంధ్ర ప్రభ) : మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో ప్రభుత్వ సొసైటీలో వడ్లు తూర్పాల పోసేందుకు వెళ్లి ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు తూర్పాల యంత్రానికి కరెంటు రావడంతో షాక్ తగిలి అబ్బుగూడెంకు చెందిన మామిడి రెమ్మల్య(20) మృతిచెందింది.
ఆమెతో పాటు మరో మహిళకు విద్యుత్ షాక్ తగలడంతో చెయ్యి కాలిపోగా, మరొకరికి షాక్ తగిలి సొమ్మసిల్లిపోవడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలు తల్లి, తండ్రి లేని అనాధ. బాధ్యతా రాహిత్యంతో సొసైటీ వారు చేసిన ఈ పనితో నిండు ప్రాణం పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.