కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని గుల్లతాండలో విషాదం నెలకొంది.శనివారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ తో తల్లికూతురు మృతి చెందారు.స్థానికుల కథనం ప్రకారం గుల్లతాండకు చెందిన చవాన్ శంకబాయి(36) కూతురు చవాన్ శివాణి ఇంట్లో నిద్రపోతున్న క్రమంలో ఎండ వేడిమి నివారణ కోసం కూలర్ పెట్టుకోగా ప్రమాదవశాత్తు చవాన్ శివాణి ఎడమ కాలు కూలర్ కోసం ఏర్పాటుచేసిన నీటిలో పడగా ప్రమాదవశాత్తు ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి కాలు పాక్షికంగా కాలిపోవటమే కాకుండా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
కూతురు పక్క నిద్రపోతున్న తల్లి కి కూడా కూతురు ద్వారా విద్యుత్ ప్రవహించి ఆమె కూడా మృతి చెందింది. కొడుకు ప్రతీక్ బయట పండుకోవడంతో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి చెల్లెలు మృత్యువాత పడటంతో ఇట్టి విషయాన్ని తాండవాసులకు తెలపడంతో వారు విద్యుత్తును నిలుపుదల చేయించారు.కుటుంబ యజమాని అయిన ప్రహ్లాద్ చవాన్ డ్రైవర్ గా ఉండటంతో ఆయన ఇతర ప్రాంతాలకి వెళ్లినట్టు వారు తెలిపారు.
ప్రహ్లద్ చవాన్ కు భార్య ఇద్దరు కూతురు,ఒక కొడుకు ఉండగా భార్య చిన్న కూతురు మృత్యువాత పడటం మరో కూతురు బంధువుల వద్దకు పోవడంతో ప్రాణం దక్కిందని,తాండవాసులు తెలిపారు.పోలీసులకు సమాచారం అందించడంతో జుక్కల్ పోలీసులతోపాటు బిచ్కుంద సీఐ నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు