పోలీస్ కమిషనర్ను కలిసిన రెడ్డి సంఘం నాయకులు
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ: వరంగల్ పోలీస్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్. శ్వేతా రెడ్డిని మంగళవారం కమిషనర్ కార్యాలయంలో రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి, వీసం సురేందర్ రెడ్డి పోలీస్ కమిషనర్కు పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మట్ట రాజశేఖర్ రెడ్డి, వీసం రవీందర్ రెడ్డి, రధరపు సంజీవ రెడ్డి, తిప్పర్తి రాఘవ రెడ్డి, వీసం కరుణాకర్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
