King Charles Speech : ఏక వాదం డేంజర్ Andhra Prabha Top Story
King Charles Speech : ఏక వాదం డేంజర్ Andhra Prabha Top Story
- అమెరికా ఫస్ట్పై హెచ్చరిక
- ట్రంప్ ఎజెండాపై కింగ్ చార్లెస్ కౌంటర్
- ప్రజాస్వామ్య రక్షణే ధ్యేయం
- ప్రజలకు హాని కలగొద్దు”
- నాటో, ఉక్రెయిన్ పై కీలక వ్యాఖ్యలు
- టెక్ దిగ్గజాలతో భేటీ…
- ట్రంప్ వ్యాఖ్యలకు మౌన కౌంటర్…
- ఇరాన్ వార్పై నో కామెంట్
- “ప్రకృతిని కాపాడాలి”… అమెరికాలో చార్లెస్ గ్రీన్ మెసేజ్
- వైట్ హౌస్లో గ్రాండ్ వెల్ కమ్
- చార్లెస్ దంపతులకు అపూర్వ గౌరవం
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి )

అటు ఇరాన్తో యుద్ధం, ఇటు నాటో దేశాలతో పేచీ.. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం అల్లాడుతోంది. ఈ చిరకాల మిత్రదేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న స్థితిలో..ఐరోపా, మధ్యప్రాచ్యంలో అనిశ్చితి, సంఘర్షణలతో సతమతం అవుతున్న తరుణంలో.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని, యూకే, యూఎస్ ఎల్లప్పుడూ ఐక్యంగా దృఢ మిత్రదేశాలుగా నిలుస్తాయని బ్రిటన్ చక్రవర్తి చార్లెస్ అన్నారు. అమెరికా . కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన రెండవ బ్రిటిష్ సార్వభౌముడుగా చార్లెస్ చరిత్ర సృష్టించారు. . ఆయన తల్లి, క్వీన్ ఎలిజబెత్ II, 1991లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చార్లెస్ దంపతులు అమెరికా పర్యటకు వచ్చారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ, “మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, మన ప్రజలందరినీ హాని నుండి రక్షించడానికి, మన దేశాల సేవలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టే ప్రజల ధైర్యానికి వందనం చేయడానికి మేము ఐక్యంగా కట్టుబడి ఉన్నాం,” అని చార్లెస్ అరుదైన ప్రసంగం చేశారు. రాణి కామిల్లాతో కలిసి ఆయన సభలోకి ప్రవేశించినప్పుడు అమెరికా కాంగ్రఎస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టి అభినందించారు.
King Charles Speech : ఏక వాదం అనర్థం

బకింగ్హామ్ ప్యాలెస్ ముందుగా చెప్పినట్లుగా, నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను చార్లెస్ ప్రస్తావించారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి అమెరికా సహాయం కొనసాగింపు ప్రాముఖ్యతను, ఏకాంతవాదం వల్ల కలిగే ప్రమాదాలను ఆయన చార్లెస్ నొక్కిచెప్పారు. తన జీవితంలో తనకు అత్యంత ప్రధానాంశం ప్రకృతిని పరిరక్షించాలని ప్రిస్స్ చార్లెస్ పిలుపునిచ్చారు. నాటో, యూరోపియన్ మిత్రదేశాలను ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవలే, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో సైనిక సహాయం అందించడానికి నాటో విముఖత చూపడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్కు అమెరికా దీర్ఘకాలం పాటు అందించే ఆర్థిక, సైనిక సహాయం విషయంలో కూడా ట్రంప్ సందిగ్ధంగా ఉన్నారు.
King Charles Speech : ఎన్నో యుద్ధాలు చూశాం

2001, సెప్టెంబర్ 11 దాడులను చార్లెస్ ప్రస్తావిస్తూ , “రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ అంతర్వ్యద్ధం.. ఇలా .. అనేక సంఘర్షణలను చవి చూస్తున్నాం. ఉమ్మడి భద్రత నిర్వచం ప్రకారం, ఒక శతాబ్దానికి పైగా మన ప్రజలు భుజం భుజం కలిపి నడాలని మనం ఇచ్చిన పిలుపునకు సమాధానం ఇచ్చాం. అత్యంత ధైర్యవంత ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసం కూడా అదే అచంచల సంకల్పం అవసరం అన్నారు. రాబోయే 250 సంవత్సరాల వైపు చూస్తున్నప్పుడు, మన అత్యంత విలువైన భర్తీ చేయలేని సహజ సంపద ప్రకృతిని పరిరక్షించే ఉమ్మడి బాధ్యత గురించి కూడా మనం ఆలోచించాలి,” అని చార్లెస్ అన్నారు. వాతావరణ మార్పులను సందేహించే రిపబ్లికన్ల వైపు నుండి ఆయనకు పెద్దగా చప్పట్లు వినిపించలేదు. ఇరాన్ పై యుద్ధంలో యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ సహకరించలేదని ట్రంప్ పదేపదే విమర్శించిన నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నతరుణంలో, అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో రెండవ రోజు చార్లెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. యూకే ప్రభుత్వం సలహా మేరకు బ్రిటిష్ చక్రవర్తి చార్లెస్ ప్రసంగించారు., కానీ ప్రకృతిని పరిరక్షించాలని ఆయన పిలుపు, మానవ ప్రవర్తన ప్రకృతితో అనుబంధాన్ని ఆయన వ్యక్తిగత, జీవితకాల అభిరుచిని ప్రతిబింబించింది.
King Charles Speech : యుద్ధంపై ట్రంప్ కవరింగ్

తరువాత, వైట్ హౌస్లో ఒక అధికారిక విందులో, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని చార్లెస్ కోరుకున్నారని ట్రంప్ అన్నారు, ఈ ప్రకటనపై చార్లెస్ వ్యాఖ్యానించలేదు. “మేము ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొద్దిగా పని చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం,” అని ట్రంప్ ఆ విందులో అన్నారు. “మేము ఆ నిర్దిష్ట ప్రత్యర్థిని సైనికంగా ఓడించాం, ఆ ప్రత్యర్థిని ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండనివ్వం. ఈ విషయంలో నాకంటే ఎక్కువగా చార్లెస్ నాతో ఏకీభవిస్తారు. ఆ ప్రత్యర్థిని ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండనివ్వం. అని ట్రంప్ విశదీకరించారు. వైట్ హౌస్లో జరిగిన ఒక లాంఛన ప్రాయ విందులో, స్వాతంత్య్ర యుద్ధ సమయంలో శత్రువులుగా ఉన్నప్పటి నుండి బ్రిటన్ అమెరికన్ల మధ్య ఏర్పడిన స్నేహాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు.
King Charles Speech : ఇరాన్ వార్ పై నో కామెంట్

ట్రంప్ ప్రసంగం తర్వాత చార్లెస్ తన వ్యాఖ్యలలో ఇరాన్ యుద్ధం గురించి ప్రస్తావించలేదు. ఇరాన్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటన్ స్పందించలేదు. అంతకుముందు, ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, చార్లెస్ ఇలా అన్నారు, యూరప్, కామన్వెల్త్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భాగస్వాములతో ఉమ్మడి విలువలను కాపాడుకుంటూనే మన దేశాలు ఉంటాయని, మరింత అంతర్ముఖంగా మారమని వస్తున్న పిలుపులను మనం విస్మరిస్తామని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ష అని చార్లెస్ అన్నారు.
King Charles Speech : టెక్కీ దిగ్గజాలతో.. భేటీ

తరువాత చార్లెస్ అమెరికా టెక్నాలజీ నాయకులతో సమావేశమయ్యారు. టెక్నాలజీ సంస్థలకు యూకే ఒక అగ్ర గమ్యస్థానంగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, ప్రారంభ దశ స్టార్టప్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. అమెజాన్ (AMZN.O) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆపిల్ (AAPL.O) సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా (NVDA.O) సీఈఓ జెన్సన్ హువాంగ్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (AMD.O) సీఈఓ లీసా సు, సేల్స్ఫోర్స్ (CRM.N) సీఈఓ మార్క్ బెనియోఫ్ ఆల్ఫాబెట్ (GOOGL.O) ప్రెసిడెంట్ రూత్ పోరాట్ తదితరులు ప్రిన్స్ చార్లెస్ ను కలిశారు,
King Charles Speech : నో కింగ్స్ కు వ్యతిరేకం
“ఇద్దరు రాజులు” అనే శీర్షికతో ట్రంప్, చార్లెస్ల ఫోటోను వైట్ హౌస్ సోషల్ మీడియా ప్రచురించింది. బ్రిటీ ష్ చక్రవర్తి కాదని చెబుతూ, ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న “రాజులు వద్దు” నిరసనలను పదేపదే వ్యతిరేకించారు. అంతేకాకుండా, ఈ వారం అధ్యక్షుడి విమర్శకులు ప్రజలలో ఆగ్రహాన్ని రెచ్చగొడుతున్నారని, దానివల్లే ఆయనపై హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు.
King Charles Speech : అపూర్వ గౌరవం

వైట్ హౌస్ నుంచి రాజు, రాణిలను లిమోసిన్లో ఎక్కించి పంపిన అనంతరం, ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “ఇది చాలా మంచి సమావేశం. ఆయన ఒక అద్భుత వ్యక్తి. అసాధారణ వ్యక్తులు. ఇది నిజంగా ఒక గౌరవం” అని అన్నారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ఫాక్లాండ్ దీవులపై బ్రిటన్ వాదనకు వాషింగ్టన్ తన మద్దతును సమీక్షించవచ్చని పెంటగాన్ అంతర్గత ఈమెయిల్ ఒకటి సూచించింది.
King Charles Speech : ఎఫ్ స్టెయిన్ స్కాంపై మౌనం

ఈ పర్యటనలో చార్లెస్ ప్రస్తావనకు రాని అంశం జెఫ్రీ ఎఫ్ స్టెయిన్ కుంభకోణం.
దివంగత అమెరికన్ లైంగిక నేరస్థుడితో సంబంధాల కారణంగా ప్రతిష్ట, రాజరిక హోదా దెబ్బతిన్న చార్లెస్ సోదరుడు ఆండ్రూ, ప్రస్తుతం తన సంబంధాలపై పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. మాజీ యువరాజు ఆండ్రూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. ఈ క్రిమినల్ కేసులపై ప్రభావం పడకుండా ఉండేందుకు, కొందరు అభ్యర్థించినట్లుగా, ఈ పర్యటనలో ఎఫ్ స్టెయిన్ బాధితులలో ఎవరికీ రాజ దంపతులను కలవడం సాధ్యపడలేదని రాజరిక వర్గాలు తెలిపాయి. ఎఫ్ స్టెయిన్ బాధితులు, న్యాయవాద సంస్థలు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించిన ఎఫ్ స్టెయిన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్’ సహ రచయిత, ప్రతినిధి రో ఖన్నా సహా బాధితులను కలవాలలనే అభ్యర్థనను చార్లెస్ తిరస్కరించారని చెప్పారు.
ALSO READ : 2026 Minab Mystery : ఇదొక సజీవ మిస్టరీ Andhra Prabha Top Story
