Accident | ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Accident | ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వంతెన పిల్లర్ నంబర్ 97 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8మంది విద్యార్థులున్నారు. మౌలాలి నుంచి పోచారం వెళ్తుండగా కారు అతివేగంగా వెళ్లి పిల్లర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను సాయివరుణ్ (23), నిఖిల్ (22)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేశ్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
