CM Chandrababu Naidu | నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి..

CM Chandrababu Naidu | నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి..

  • ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

CM Chandrababu Naidu | విజయవాడ, ఆంధ్రప్రభ : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా చర్యలు వేగంగా జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక వసతుల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ రోజు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు, ఎన్డీయే కూటమి(NDA alliance) నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వేడుకలకు శోభ చేకూర్చారు.

CM Chandrababu Naidu |

భోగి వేడుకల్లో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ తన సతీమణి కేశినేని జానకీ లక్ష్మీ, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధతో పాటు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. కార్యక్రమానికి ముందు గద్దె అనురాధతో కలిసి టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

CM Chandrababu Naidu |

ఈ సందర్భంగా భోగి మంటల్లో గత వైసీపీ ప్రభుత్వ(YSRCP government) విధానాలకు నిరసనగా జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల ప్రతులను దహనం చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులపై కూడా జగన్ బొమ్మ ముద్రించడం అనవసరమని విమర్శించిన ఎంపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసినట్లు తెలిపారు.

CM Chandrababu Naidu |

మెడికల్ కళాశాలలకు సంబంధించిన జీవోలు కూడా వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
విజయవాడలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం(drainage construction) చేపట్టడంతో పాటు రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు.

నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

CM Chandrababu Naidu |

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బొప్పన భవకుమార్, జంపాల సీతారామయ్య, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు చలసాని రమణ, ఎస్సీ సెల్ నేతలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు, ఎన్డీయే కూటమి కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : MODI | పొంగలి వండిన ప్రధాని మోడీ

CLICK HERE TO READ MORE :

Leave a Reply