- అధిక వడ్డీల పేరిట రూ.14 కోట్ల కుచ్చుటోపి
హైదరాబాద్,ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కూకట్పల్లిలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపిన వెల్ విజన్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. వివరాల్లోకి వెళితే.. వెల్విజన్ ఇన్ఫ్రా కంపెనీ.. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్గా ఇస్తామని కస్టమర్లను ఆకర్షించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు వాషింగ్ మిషన్, రూ.3 లక్షలకు ఫ్రిడ్జ్ బోనస్గా ఇస్తామని చెప్పి నమ్మబలికింది.
ఇలా కస్టమర్ల నుంచి ఏకంగా రూ.14 కోట్లు ముట్టిన తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ నేపథ్యంలో మోసపోయామని గ్రహించిన బాధితులు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెల్విజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరిట 3 స్కీమ్లతో భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకుని.. మొదటి స్కీంలో లక్షకు రెండు లక్షలు ఇస్తామంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారని పోలీసుల విచారణతో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.