PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు..
PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు..
PM Kisan | ములుగు, ఆంధ్రప్రభ : ఉద్యాన పంటల విస్తీర్ణత పెరగడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని రైతులు స్థిరమైన ఆదాయం ఎకరా అకౌంట్ 70 వేల(70 thousand per acre account) నుండి లక్ష రూపాయల వరకు అదనంగా లభిస్తుందని దీని ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో పీఎం కిసాన్ సన్ యోజన(PM Kisan Sun Yojana) కింద 21వ విడత(21st installment) నిధులు ప్రారంభించగా ఈ రోజు మండల కేంద్రమైన ములుగు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యానవనం విశ్వవిద్యాలయ ఉపకులపతి దండరాజిరెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాకర్ రెడ్డి, అనిత కుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని అచ్చయ్యపల్లి, బండ మైలారం, చిన్న తిమ్మాపూర్, నర్సంపల్లి, క్షీరసాగర్ గ్రామాల తోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొనగా ఉద్యాన పంటల సంరక్షణపై రైతులు అడిగిన పలు సందేహాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి(Dr. Prabhakar Reddy), కూరగాయల పరిశోధన సంస్థ అధినేత డాక్టర్ అనిత కుమారి రైతులతో వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకుని సలహాలు, సూచనలు అందించారు.
అనంతరం ఉపకుల పత్తి దండ రాజిరెడ్డి(Patti Danda Rajireddy) మాట్లాడుతూ.. ఉద్యాన పంటల అభివృద్ధికై ములుగులోని పరిపాలన అధికారిక కార్యాలయంలో కొత్తగా పండ్ల మొక్కల అభివృద్ధికి నర్సరీని స్థాపించామని పరిమి కంపోస్ట్ యూనిట్(Parimi Compost Unit) కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సేవలు రైతుల సద్విని చేసుకోవాలని ఆయన సూచించారు.

ఉద్యానవన పంట సాగు చేయడం కోసం సేంద్రియ ఎరువులు(Organic Fertilizers) వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, భూసారం పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించిన సహజ వ్యవసాయ శాఖ సమావేశం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో పీఎం కిసాన్ యోజన పథకం(PM Kisan Yojana Scheme) అని రైతులు ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భగవాన్, చిన్ననాయక్, సురేష్ కుమార్, లక్ష్మీనారాయణ, సౌమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
