PBKS vs RCB | ఆర్సీబీ రివెంజ్ అదుర్స్.. పంజాబ్ పై ఘ‌న విజ‌యం !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాంగంగా నేడు ముల్ల‌న్పూర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ ఆర్పీబీ ఘ‌న విజ‌యం సాధించింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో రాణించిన బెంగళూరు.. ఆల్రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. కాగా, పంజాబ్ – ఆర్సీబీ జట్లు ఇటీవల బెంగళూరులో తలపడ‌గా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆథిత్య ఆర్సీబీని ఓడించింది. అయితే, ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను పంజాబ్ సొంత మైదానంలో ఓడించి తక్కువ సమయంలోనే మునుపటి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది.

విరాట్ – పడిక్కల్ పవర్ పంచ్

ఇక‌పోతే ఈ మ్యాచ్ లో 158 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో ఛేజింగ్ కు దిగిన బెంగ‌ళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో త‌మ ఖాతాలో 10 పాయింట్లు వేసుకున్న ఆర్సీబీ… పాయింట్ల పట్టికలో 5వ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుంది. మ‌రోవైపు 3వ స్థానంలో ఉన్న పంజాబ్ 4వ స్థానానికి ప‌డిపోయింది.

స్వ‌ల్ప ల‌క్ష్యంతో ఛేద‌న‌కు దిగిన ఆర్సీబీకి తొలి ఓవ‌ర్లోనే షాక్ త‌గిలింది. అర్ష‌దీప్ సింగ్ బౌలింగ్ లో ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ (1) ఔట‌య్యాడు. అయితే, ఆ ఎదురుదెబ్బ‌కు ఏమాత్రం ప్రభావితం కాకుండ ఆర్సీబీ బ్యాట‌ర్లు పంజాబ్ బౌలర్లను దంచేశారు. ఆర్సీబీ టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సుతో *73 నాటౌట్) – దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల‌తో 61) అర్ధ‌శ‌త‌కాల‌తో విరుచుకుప‌డ్దారు.

వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ తో జ‌త‌క‌ట్టిన విరాట్ కోహ్లీ… రెండో వికెట్ కు 69 బంతుల్లో 103 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. తొలి ఓవ‌ర్లో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ… 13 ఓవ‌ర్ల వ‌ర‌కు వికెట్ కోల్పోకుండా పంజాబ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డింది.

అయితే, 10.2 ఓవ‌ర్లో 30 బంతుల్లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్న ప‌డిక్క‌ల్.. మోత్తం 35 బంతులు ఎదుర్కుని 5 ఫోర్లు, 4 సిక్సుల‌తో 31 ప‌రుగులు చేసి 12.3 ఓవ‌ర్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీద‌ర్ 12 ప‌రుగులు చేసి హర్‌ప్రీత్ బ్రార్ వేసిన‌ 16.4 వ ఓవ‌ర్లో కెప్టెన్ క్యాచ్ ఔట‌య్యాడు. ఇక ఆఖ‌ర్లో వ‌చ్చిన జితేష్ శర్మ 11 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, చాహ‌ల్ త‌లా ఒక వికెట్ ద‌క్కించుక‌న్నారు.

అంత‌క‌ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలింగ్ ధాటికి త‌క్కువ ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. పంజాబ్ ఓపెన‌ర్లు ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 22), ప్ర‌భ‌సిమ్రాన్ సింగ్ (17 బంతుల్లో 33) రాణించ‌గా.. శ్రేయ‌స్ అయ్యార్ (6), నేహ‌ల్ వ‌ధేర (5), మార్క‌స్ స్టోనిస్ (1) విఫ‌ల‌మ‌య్యారు. ఇక శ‌శాంక్ సింగ్ (31) – మార్కో జాన్స‌న్ (25) ప‌రుగులు చేయ‌డంతో పంజాబ్ స్కోర్ 157కు చేరింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో కృణాల్ పాండ్యా, సుయాష్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌గా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడ‌గొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *