Nandyala | ట్రైనీ ఐపిఎస్ స్మార్ట్ స్పంద‌న‌తో నిలిచిన విద్యార్ధి ప్రాణం

నంద్యాల బ్యూరో ‍ ఆంధ్ర‌ప్ర‌భ -..నేను ఒక గంటలో ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ స్నేహితులకు పంపిన వాట్సాప్ మెసేజ్…. మెసేజ్ చూసి కంగు తిన్న స్నేహితులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించడంతో ఆ విద్యార్థిని కాపాడిన సంఘటన చోటుచేసుకుంది. నంద్యాల కు చెందిన ఓ యువకుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. సమస్యలు ఏమున్నాయో తెలియదు.. జీవితంపై విరక్తి చెంది నేను రామచంద్రపురం మండల పరిధిలోని అడవుల్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నంద్యాలలో ఉన్న స్నేహితులతో పాటు హాస్టల్లో తనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులకు స్నేహితులకు వాట్స్అప్ మెసేజ్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. స్నేహితులు వెంటనే స్పందించి వారు రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించారు.

రామచంద్రాపురంలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి బొడ్డు హేమంత్ వెంటనే స్పందించారు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ను ట్రేస్ చేశారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని కాపాడారు. ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులను కూడా పిలిపించి సమస్యలను అడిగి వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది.మొత్తానికి ఆ విద్యార్థి ప్రాణాలను కాపాడిన ట్రైన్ ఐపిఎస్ బొడ్డు హేమంత్ ను పలువురు అభినందించటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *