Minister | ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి

Minister | ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి

Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మె మార్గం కాదని సూచిస్తూ, కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని, అవన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని, కమిటీ పేరుతో కాలయాపన చేస్తామనడం తప్పని స్పష్టం చేశారు.

ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ అంశాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిపై అధ్యయనం చేసేందుకు గడువు అవసరమైందన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు.

ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల నుండి కోలుకుంటోందని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులు నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది కలగజేయవద్దని విజ్ఞప్తి చేశారు. విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

Leave a Reply