MI vs CSK | రాణించిన చెన్నై మిడిలార్డ‌ర్.. ముంబై టార్గెట్ ఎంతంటే !

ఈరోజు డ‌బుల్ హెడ‌ర్ లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ చెన్నై మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు శివం దూబే – ర‌వీంద్ర జ‌డేజా రాణించారు. దాంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన చెన్నై.. నిర్ణీత ఓవ‌ర్లో 5 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు సాధించింది.

వాంఖ‌డే వేదిక‌గా టాస్ ఓడిన‌ చెన్నై మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా.. ఓపెనింగ్ బ్యాట‌ర్లు షేక్ రషీద్ (19), ర‌చిన్ ర‌వీంద్ర (5) విఫ‌ల‌మ‌య్యారు. ఇక వ‌న్ డౌన్ లో వ‌చ్చిన‌ డెబ్యూట్ ప్లేయ‌ర్ ఆయుష్ మాత్రే (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల‌తో 32) ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌రువాత‌ శివం దూబే (32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల‌తో 50), ర‌వీంద్ర జ‌డేజా (35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల‌తో *53 నాటౌట్) అర్ధ‌శ‌త‌కాల‌తో అద‌ర‌గొట్టారు. దీంతో చెన్నై స్కోర్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 176కు చేరింది.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా రెండు వికెట్లు తీయ‌గా… దీపక్ చాహర్, అశ్విన్ కుమార్, మిచెల్ సాంట్నర్ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. దీంతో ముంబై జ‌ట్టు 177 ప‌రుగుల ల‌క్ష్యంతో ఛేద‌న‌కు దిగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *