NEWS@10:00 A.M | 8 జూలై 2026 ముఖ్యాంశాలు

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు.  click here to read full story

దాంపత్య బంధాల్లో పెరుగుతున్న హత్యలు..

రాష్ట్రంలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న కొన్ని దారుణ హత్యలు సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు విడాకుల వరకు మాత్రమే వెళ్లేవి. కానీ ఇప్పుడు కొందరు వివాహేతర సంబంధాల మోజులో జీవిత భాగస్వామినే అడ్డంకిగా భావించి హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. click here to read full story

ఏఐతో నేర నియంత్రణకు కొత్త వ్యూహం

తెలంగాణ పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ ఉండేలా కొత్తగా ప్రత్యేక విభాగాల ఏర్పాటుపై డీజీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. click here to read full story


సన్న ధాన్యం టెండర్లలో సిండికేట్ ఆరోపణలు.. ఈ-వేలం ప్రక్రియపై అనుమానాలు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు పంపిణీ చేసే సన్నరకం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో తెరవెనుక సిండికేట్ నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టెండర్ల ఈ-ప్రక్రియను కొందరు అధికారులు, రైస్ మిల్లర్లు కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. click here to read full story

India Iran Relations | భారత్–ఇరాన్ సంబంధాల చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం

ఇరాన్‌తో భారతదేశ సంబంధం సహస్రాబ్దాల పరంపర. మన సనాతన సాంప్రదాయం మరియు ఇరాన్ సంస్కృతికి మూలాధారమైన జథు మతం (జోరాష్ట్రియన్ మతం) మధ్య ఉన్న అనేక సామ్యాలు; మన వేద వాంగ్మయం, వారి మతగ్రంథం అవేస్తాలోని మంత్రశబ్దాలలో గల సామీప్యత; ఉభయ మత విశ్వాసాల్లో పాటించబడే అగ్నిపూజ వంటి క్రతువులు ఒకే మూలభావనల నుంచి ఉద్భవించిన సారూప్యతల ఆధారంగా పరిణతి చెందిన రెండు విశిష్ట నాగరికతలుగా వీటిని పరిగణించవచ్చు. click here to read full story

Modi Indonesia Visit | ఇండోనేషియాలో మోడీకి అత్యున్నత గౌరవం..

ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాతో రక్షణ సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం జరుపుతున్న పర్యటన ఎంతో దోహదం చేస్తుంది. ఇండోనేషియాతో మన దేశానికి ఎంతో కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. 1965లో అధికారాన్ని చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజావిప్లవంతో అధికారాన్ని కోల్పోయారు. click here to read full story

మనిషిని సన్మార్గంలో నడిపించే మనోదర్పణం

అద్దంలో మనిషి యొక్క అందచందాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మనిషి యొక్క తప్పొప్పులను చూపే అద్దం ఇంకొకటి ఉంది. ప్రతి మనిషికీ ఒక మనసు ఉంటుంది. ఆ మనసే మనిషి ఆత్మకు ప్రతిబింబం. ఆ మనసుకు ఒక దర్పణం ఉంటుంది. click here to read full story