Jubilee Hills | నవీన్ గెలుపుతో తలనీలాలు సమర్పించిన కాంగ్రెస్ నేత…

Jubilee Hills | నవీన్ గెలుపుతో తలనీలాలు సమర్పించిన కాంగ్రెస్ నేత…
Warangal | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధిస్తే తలనీలాలు ఇస్తానని స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలోని మీదికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జోగు కుమార్(Jogu Kumar) మొక్కుకున్నాడు.
ఈ రోజు మెదక్ చర్చిలో మొక్కులు చెల్లించుకున్నాడు. ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు తల నీలాలు కూడా అర్పించారు. ఆయన గెలుపు ప్రభువు కృపగా భావించిన జోగు కుమార్ తలనీలాలు సమర్పిం చారు.
