Four days Summit | వేవ్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ – హాజరైన సినీ ప్రముఖులు

ముంబై వేదికగా నాలుగు రోజుల పాటు సదస్సు
వరల్డ్ ఆడియో,విజువ‌ల్ , ఎంట‌ర్ టైన్మెంట్ గా స‌మావేశాలు

ముంబై – వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ -వేవ్స్‌ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ మీడియా పవర్‌ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు భారత ప్రభుత్వం ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివ‌రించారు. గ‌త వందేళ్ల‌లో భార‌తీయ సినిమా ఉన్న‌త శిఖ‌రాల‌కి కూడా చేరుకుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని మోదీ అన్నారు.. ఈ సమ్మిట్‌ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు

హాజరైన సినీ ప్రముఖులు..

ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్. హేమ మాలిని, అక్ష‌య్ కుమార్, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌దిత‌రుల హాజ‌ర‌య్యారు.

కాగా, ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఇందులో మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల‌కి చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *