AP | సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం..

AP | సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం..

AP, మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మంగళవారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ. 7,64,619 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఆది మంగళవారాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply