Mopidevi | రికార్డు ఆదాయం..

Mopidevi | రికార్డు ఆదాయం..
Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్య క్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్కరోజులో వివిధ సేవల టికెట్ల ద్వారా రూ.9,57,379 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు. ఆది, మంగళవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ప్రతి నిత్యం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారని తెలిపారు.
