Sandhya Rani | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి,
- కొండాయి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి
- కుర్సం సంధ్యరాణి మహేష్
Sandhya Rani | ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : కొండాయి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచిగా గెలిపిస్తే కొండాయి గ్రామాన్నిమంత్రి సీతక్క ఆశీస్సులతో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుర్సం సంధ్య రాణి మహేష్ ప్రజలకు హామీ ఇచ్చారు.
గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి కుర్సం సంధ్యరాణి మహేష్ మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి సీతక్క ఆదేశాలతో కొండాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ అభిమానులు గ్రామ పెద్దల ఆశీస్సులతో కొండాయి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుర్సం సంధ్య రాణి మహేష్ పోటీ చేయడానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి కుర్సం సంధ్య రాణి మహేష్ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతానని, గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లును, డ్రైనేజీ పనులను చేపిస్తానన్నారు. అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

