శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి)
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం వేచి చూడాల్సివస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,718 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 21,937 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు.

