ఆధ్యాత్మిక వాతావరణంలో కుంభాభిషేకం
- కోకాపేటలోని ASBL స్పైర్లో భక్తి, శ్రద్ధలతో మహా కుంభాభిషేకం
హైదరాబాద్ : కోకాపేటలోని ASBL స్పైర్లో వేంచేసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి భక్తి, శ్రద్ధలతో, ఆగమశాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి. ASBL స్పైర్లో కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుంది. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.
ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు సమాజాలను దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాము. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించడం ద్వారా విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టిగా వేడుక జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని తెలిపారు.
ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలు నిర్వహించగా… గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.



