Metro | వెనక్కి తగ్గిన బెంగళూరు మెట్రో
మెట్రో చార్జీలను భారీగా పెంచిన బెంగళూరు మెట్రో వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెంచిన ఛార్జీలను 30 శాతం తగ్గిస్తున్నట్లు బెంగళూరు మెట్రో కార్పొరేషన్ ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. చార్జీల తగ్గింపు నిర్ణయం 14వ తేదీ (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.