TG | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క నెల పని చేయండి.. వైద్యులకు సీఎం విజ్ఞప్తి!

ఏఐజీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తాం
కొత్త‌గా అందుబాటులోకి 25 ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్
వైద్య‌, ఆరోగ్య రంగానికి భారీగా బ‌డ్జెట్ నిధులు
హైద‌రాబాద్ ను మెడిక‌ల్ హబ్ గా మారుస్తాం

హైద‌రాబాద్ – ఏడాదిలో ఏదో ఒక్క నెల (One Month ) ప్రభుత్వ ఆసుపత్రిలో (government Hospital ) పని చేయాల‌ని వైద్యులకు (Doctors ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy ) కోరారు. విదేశాల్లో ఉండే వైద్యులు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తున్నారని, వారు నిమ్స్ (NIMS ) లాంటి ఆసుపత్రుల్లో సేవ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆసుపత్రులను సిద్ధం చేస్తామ‌ని అంటూ త్వరలో మ‌రో 25 ప్ర‌భుత్వ‌ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

బంజారాహిల్స్‌‌లో నెల‌కొల్పిన ఏఐజీ ఆస్పత్రిని (AIG Hospital ) సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ, హైదరాబాద్‌కు నాగేశ్వర్ రెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చార‌ని ప్ర‌శంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తూ, ఆయ‌న భారతరత్నకు అర్హులని రేవంత్ అన్నారు.. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి త‌న‌ వంతు ప్రయత్నం చేస్తాన‌ని చెప్పారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కోసం 66 దేశాల నుంచి రోగులు రావడం మనకు గర్వకారణమ‌న్నారు..


తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామ‌ని,. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుంద‌న్నారు రేవంత్. హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామ‌ని అన్నారు. విద్యా వైద్యంకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు, రూ.21500 కోట్లు విద్యా రంగం అభివృద్ధికి కేటాయించామ‌ని పేర్కొన్నారు.

Leave a Reply