నిజామాబాద్ ప్రతినిధి (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ (nizamabad ) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(turmeric board ) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (home minister amit shah) నేడు లాంచనంగా ప్రారంభించారు.. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన అక్కడ నుంచి హెలికాప్టర్ లో ఇందూరుకి వచ్చారు. అనంతరం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే పసుపు బోర్డు కార్యా లయంలో ఏర్పా టు చేసిన పసు పు ఉత్పత్తులను పరిశీలించారు. అలానే కంఠేశ్వర్ కూడలిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహాని ఆయన అవిష్కరించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో పాల్గొని అమిత్ షా పాల్గొన్నారు..

కాగా, జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్ల నాటి కల నేడు ఫలించింంది. పసుపు మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని, జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి నిరసన వ్యక్తం చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం తాజాగా దాన్ని నెరవేర్చింది.