West Bengal | లా క‌ళాశాల‌లోనే విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం

కోల్ క‌తాలోని క‌స్బాలోని న్యాయ క‌ళాశాల‌లో ఘ‌ట‌న
బాధితురాలు, నిందితులు ఈ క‌ళాశాల‌కు చెందిన వారే
ముగ్గురు అరెస్ట్ … లా క‌ళాశాల సీజ్

కోల్ క‌తా – దక్షిణ కోల్‌కతాలోని కస్బాలోని ఒక లా కాలేజీలో విద్యార్థినిపై సాముహిక అత్యాచారం జరిగిని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాలేజీలోనే యువతిని అత్యంత పాశావికంగా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన.. కస్బాలోని కళాశాల ప్రాంగణంలో జరిగినట్లు కోల్ కతా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో లా కాలేజీ పూర్వ విద్యార్థితో పాటు ఇద్దరు ప్రస్తుత విద్యార్థులు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఈ నెల 25న రాత్రి 7.30 గంటల నుండి రాత్రి 10.50 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కస్బా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు..

అత్యాచారం జ‌రిగిన లా క‌ళాశాల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇక నిందితుల్లో కళాశాల మాజీ యూనిట్ ప్రెసిడెంట్‌గా చేసిన 31 ఏళ్ల మోనోజిత్ మిశ్రా, 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ ఉన్నారని పోలీసు వర్గాలు నిర్ధారించాయి. వారి వ‌ద్ద ఉన్న సెల్ ఫొన్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు.. వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు.. కోర్టు ఈ ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధించింది.

కాగా, కొన్ని నెల‌ల ముందు కోల్ కతాలో ఆర్జీకర్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన సంచ‌ల‌నం సృష్టించింది.. ఈ ఘటనపై కోల్ కతా వ్యాప్తంగా మెడికోల్ లు అనేక నెలలో పాటు.. హత్యచారంకు గురైన యువతికి న్యాయంజరగాలని, దీని వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాల‌ని నిరసనలకు దిగారు. ఈ ఘటన మరువక ముందే.. నేడు మరో దారుణం చోటు చేసుకుంది.

Leave a Reply