TG | పాడి కౌశిక్ రెడ్డికి బేయిల్ మంజూరు !

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కాజిపేట కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొద్దిసేపటి క్రితమే కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.

ఇందుకు ముందు, కౌశిక్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి, వరంగల్‌కు తరలించారు. ఆయనపై గ్రానైట్ వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయగా.. 14 రోజుల రిమాండ్‌కు కోర్టు పంపింది.

తాజాగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయ‌గా… కౌశిక్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply