TG | ఆందోళన వద్దు! … అర్హులంద‌రికీ న్యాయం చేస్తా : రైతులకు మంత్రి తుమ్మల భరోసా

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రైతు భరోసా(raithu Bharosa ) నిధులు జమకాని రైతులు (farmers ) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister tummala ) సూచించారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా భూముల యాజమాన్యం పొందిన రైతులకు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని ప్రభుత్వం తెలిపిన విషయం విదితమే. జూన్ 5వ తేదీ వరకు భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది.

జూన్ 20 వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తులు
ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన జూన్ 20వ తేదీ వరకు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చున‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు సంబంధిత ఏఈవో దగ్గరకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 20వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు.

Leave a Reply