Floods | ఈశాన్య రాష్ట్రాల‌లో వ‌ర‌ద‌లు .. ఇప్ప‌టికే 34 మంది మ‌ర‌ణం


వేలాది మంది నిరాశ్ర‌యులు
అస్సాం, సిక్కిం, మ‌ణిపూర్ జ‌న‌జీవ‌నం అస్థ‌వ్య‌స్తం
ఆ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు మోదీ ఫోన్
వ‌ర‌ద ప‌రిస్థితి గురించి ఆరా
కేంద్రం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అక్క‌డ వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. . అస్సాం, సిక్కిం, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇప్ప‌టికే సుమారు 34 మంది మృతిచెందారు.

ఈ నేప‌థ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ త‌మాంగ్‌, మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ అజ‌య్ భ‌ల్లాతో ఇవాళ ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. వ‌ర‌ద విప‌త్తును ఎదుర్కొనేందుకు స‌హ‌యం అందించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి తెలుసుకునేందుకు ప్ర‌ధాని మోదీ ఫోన్ చేసిన‌ట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ తెలిపారు. ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే వ‌ర‌ద ప‌రిస్థితి నెల‌కొన్న విష‌యాన్ని మోదీకి వివ‌రించిన‌ట్లు బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన రిలీఫ్ ఆప‌రేష‌న్ గురించి కూడా చెప్పిన‌ట్లు త‌న ఎక్స్‌లో ఆయ‌న వెల్ల‌డించారు. కొన్ని చోట్ల వ‌ర‌ద‌ల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ప్ర‌స్తుతం స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *