Jharkhand | విమానాన్ని ఢీకొన్న ప‌క్షి – రాంచీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ …

రాంచీ – ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నేడు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగా ఓ రాబందు బలంగా ఢీకొనడంతో, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సుమారు 175 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, పాట్నా నుంచి రాంచీ వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ 320 విమానం, రాంచీ విమానాశ్రయానికి సుమారు 10 నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో, 3000 నుంచి 4000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1:14 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య పీటీఐకి వివరించారు.

“ఇండిగో విమానాన్ని రాంచీ సమీపంలో ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ విమానాన్ని ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు” అని మౌర్య తెలిపారు. ఒక రాబందు ఢీకొనడం వల్ల విమానం ముందు భాగంలో కొంత సొట్ట పడిందని, ఇంజనీర్లు ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply