Local Made Drones | పాక్ పై దాడి చేసింది మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లే

ఇజ్రాయేల్ స‌హ‌కారంతో బెంగ‌ళూరులో త‌యారీ
తొలిసారి పాక్ పై దాడికి వినియోగం
అనుకున్న ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతం చేధించిన కామికేజ్‌ డ్రోన్లు
ఈ సూసైడ్ డ్రోన్ల దెబ్బ‌కు 100 మందికి పైగా ఉగ్ర‌వాదులు హ‌తం
తొమ్మిది ఉగ్ర‌వాద పోస్ట్ లు ధ్వంసం

న్యూఢిల్లీ, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ కోసం భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. వీటిలో స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు, హ్యామర్‌ బాంబులతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌ సహకారంతో బెంగళూరుకు చెందిన అల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(ఏడీటీఎల్‌) అభివృద్ధి చేసిన స్కై-స్ట్రైకర్‌ సూసైడ్‌ డ్రోన్లు ఈ ఆపరేషన్‌ సందర్భంగా అరంగేట్రం చేశాయి.

శత్రు శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి విరుచుకుపడేందుకు వీలుగా వీటిని రూపొందించారు.ఈ లాయిటరింగ్‌ మ్యూనిషన్లు 5 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలవు. సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో ఆకాశంలో తిరుగుతూ, లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి విధ్వంసం సృష్టిస్తాయి. కామికేజ్‌ డ్రోన్లుగా పిలిచే ఈ ఆత్మహుతి డ్రోన్ల తయారీ ఖర్చు కూడా చాలా తక్కువే. ఇటువంటి 100 యూఏవీల కొనుగోలు కోసం 2021లో ఒప్పందం చేసుకొని భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. రెండు రోజుల క్రితం వాటిని పాక్ లోని 15 ల‌క్ష్యాల‌పై సందించారు..అన్ని ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా చేదించాయి.. ఉగ్ర‌వాద స్థావ‌రాలు ఈ మాన‌వ ర‌హిత డ్రోన్ లు ధ్వంసం చేశాయి.. వాటి ధాటికి 100 మందికి పైగా ఉగ్ర‌వాదులు గాయ‌ప‌డ‌గా, తొమ్మిది ఉగ్ర స్థావ‌రాలు పూర్తిగా ధ్యంస‌మ‌య్యాయి.. ఈ వివ‌రాల‌ను ఆర్మీ వెల్ల‌డించింది.

Leave a Reply