ఘనంగా దండు మారెమ్మ జాతర ఉత్సవాలు..
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, (ఆంధ్రప్రభ): మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మంత్రి వాకిటి శ్రీహరిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంతు, వాకిటి శ్యామ్, ఆలయ కమిటీ సభ్యులు టప్ప కృష్ణ, బసంత్ సింగ్, వెంకట్ రెడ్డి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
