ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధిచెందాలని తిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక అక్షరాస్యతపై క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు బ్యాంకు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలన్నారు.
ప్రజలు బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఈ-కేవైసీప్రాధాన్యత, నామినీ క్లెయిమ్ విధానం గురించి అవగాహన కలిగి ఉండాలని ఉండాలన్నారు. సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి బీమా పథకాల తెలుసుకోవాలన్నారు.సైబర్ మోసాలపై జాగ్రత్తలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ చాంద్ సుల్తానా, గ్రామీణ నీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్, ఏఈఓ ప్రశాంతి బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
