AP | వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం.. దేవినేని అవినాష్

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని, ప్రజల కనీస బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయ కర్తలతో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు వెళ్ళలో మీ అంశంపై అవినాష్ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన వైసిపి ఫీజుపోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నాయకులందరూ కలిసి విడుదల చేశారు.

అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ… వైసీపీ జిల్లా స్థాయి సమావేశం ఆన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల తో నిర్వహించామని, రానున్న రోజులలో ప్రజల పక్షాన నిలబడి ఏ విధంగా పోరాటం చేయాలని అంశంపై చర్చించినట్లు చెప్పారు. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని, వైసిపి అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని బిసెంట్ రోడ్ వైసిపి కార్యాలయం నుంచి కలక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి మేమరoడం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి శ్రేణులు అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్న కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

నందిగామ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ… చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. డబ్బులు లేవు పథకాలు అమలు చేయడం కుదరదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నరు. వైఎస్ఆర్ హయంలో కానీ జగన్ హయాంలో గాని పేద విద్యార్థులకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. నేడు కుటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు విద్యార్థులకు శాపంల మారిందన్నారు.

సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు మాట్లాడుతూ… టిడిపి ప్రభుత్వం విద్యార్థులోకానికి అన్యాయం చేస్తుందని, ఫీజు బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించే విధంగా పోరాడతాం అని ప్రకటించారు. విద్యార్థులను యాజమాన్యాలు హింసిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించాలన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని వైఎస్ఆర్,జగన్ పని చేసారని తెలిపారు. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో విద్య వ్యవస్థను గాడిలో పెట్టారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో నగదు జమ అయ్యే వరకు ఉద్యమిస్తమన్నారు.

తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాసు మాట్లాడుతూ… విద్యార్థుల మిద కూటమి ప్రభుత్వం విషం కక్కుతోందన్నారు. జగన్ నాడు నేడు లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు అండగా ఉన్నారని, తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఫీజు పోరు కార్యక్రమం చేపట్టి కలెక్టర్ కి విద్యార్థుల బాధలు తెలియజేస్తాన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ వేల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రుహుల్ల, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జగ్గయ్యపేట ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నర్నల తిరుపతి యాదవ్, పోతినా మహేష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *