మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ దర్యాప్తు ముగిసింది. ఈరోజు విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు విచారించారు.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని వివిధ అంశాలపై విచారించారు. అనంతరం మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఆయన సంతకాలను తీసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.