Liquor scam case | ముగిసిన‌ మిథున్ రెడ్డి సిట్ విచార‌ణ..

మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ దర్యాప్తు ముగిసింది. ఈరోజు విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు విచారించారు.

కోర్టు ఆదేశాల మేరకు అధికారులు న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని వివిధ అంశాలపై విచారించారు. అనంత‌రం మిథున్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి ఆయన సంతకాలను తీసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *