లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా డాక్టర్ ఎం.రామచంద్రరావు ఎన్నిక

లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా డాక్టర్ ఎం.రామచంద్రరావు ఎన్నిక
వికారాబాద్, ఆంధ్రప్రభ : లయన్స్ ఇంటర్నేషనల్ వికారాబాద్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎం. రాంచందర్ రావు ఎన్నికయ్యారు
వికారాబాద్ జిల్లాలో అత్యంత సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎం. రాంచందర్ రావు ప్రతిష్టాత్మక లయన్స్ ఇంటర్నేషనల్ వికారాబాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
న్యాయవాద వృత్తిలో దశాబ్దాల అనుభవం కలిగి, సమాజంలో విశేష గౌరవం పొందిన డాక్టర్ ఎం. రాంచందర్ రావు ఈ పదవికి ఎన్నికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక సేవలో ఆయన చూపిస్తున్న నిరంతర ఆసక్తిని గుర్తించి లయన్స్ క్లబ్ సభ్యులు ఈ బాధ్యతను అప్పగించారు.
వికారాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు సామాజిక వేత్తలు ఆయనకు అభినందనలు తెలుపుతూ, ఒక సీనియర్ నాయకుడి మార్గదర్శకత్వంలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు మరింత పటిష్టంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. రాంచందర్ రావు మాట్లాడుతూ, తన అనుభవాన్ని రంగరించి పేద ప్రజలకు అండగా నిలిచే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతానని ప్రకటించారు.
