ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ..

పెనమలూరు – ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురికి లబ్ధిదారులకు మొత్తం రూ.9,57,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి పత్రాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందజేశారు.

ఖరీదైన వైద్య చికిత్సలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ, అవసరమైన ప్రతి సమయంలో అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం మా బాధ్యత” అన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సేవా రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్నారన్నారు.