Kakinada Port Case – విచారణకు రండి .. విజయ సాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

వెలగపూడి – : రాజ్యసభ మాజీ సభ్యుదు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (b), రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదు అయింది.

అయితే, కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని సాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. అయితే, పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయ సాయిరెడ్డిపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *