Champions Trophy | ల‌బూ షేన్ ఔట్…జడేజాకు వికెట్

దుబాయ్ – చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీస్ లో మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.. వరుణ్ చక్రవర్తి తొలి ఓవ‌ర్ లోనే ట్రావీస్ హెడ్ ను పెవిలియ‌న్ కు పంపించాడు. 39 పరుగులు చేసిన ట్రావీస్ హెడ్ వ‌ర‌ణ్ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు..ఇక ఇండియాతో జ‌రుగుతున్న సెమీస్ మ్యాచ్ లో ఆదిలోనే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ‌త‌గిలింది..

కూప‌ర్ సున్నా ప‌రుగుల‌కే ష‌మీ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ఈ వికెట్ ష‌మీకి ల‌భించింది.. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబూషేన్ 29 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఔట్ అయి పెవిలియన్ కు చేరుకున్నాడు. 22.3 ఓవర్లలో 110 పరుగులు చేసింది ఆసీస్.

Leave a Reply