TG | రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్ కేర్ వైద్యులుగా మారి క్రిమిసంహారక మందు సేవించి వచ్చిన రోగికి వైద్యం చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన తుర్రెమ్ సునీల్ కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించడంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.

ఆసుపత్రికి చేరుకోగానే డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ డ్యూటీలో లేకపోవడంతో పేషెంట్ కేర్ నర్సులిద్దూ కలిసి వైద్యం చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలు కాపాడమని ఆసుపత్రికి వస్తే … ఆసుపత్రిలో విధుల్లో ఉండవలసిన డాక్టర్… నర్సంపేట నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *