Social media | అభినందనలు పొందిన జాన్సన్ నాయక్…
Social media | నిర్మల్ దస్తూరాబాద్,ఆంధ్రప్రభ : దస్తురాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దేవుని గూడెం సర్పంచ్ ఎండపెల్లి గంగన్న, అకొండపేట సర్పంచ్ జాడి మాధవి శంకర్, ఎర్రగుంట సర్పంచ్ భూక్యా పద్మ కళ్యాణ్(Bhukya Padma Kalyan) లు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ నీ మర్యాద పూర్వకంగా కలిశారు.
వారిని జాన్సన్ నాయక్ శాలువాలతో సత్కారం చేశారు. పార్టీనీ నమ్ముకొని పని చేసే వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇందులో ఖానాపూర్ నియోజకవర్గం సోషల్ మీడియా(Social media ఇంచార్జి బొమ్మేన గోపి, మాజీ వైస్ ఎంపీపీ రాజు నాయక్, మండల సోషల్ మీడియా ఇంచార్జి రాజేందర్, తదితరులు ఉన్నారు.

