MLA | హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి…

MLA | హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి…

MLA | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు కోసం అత్యంత కీలకమైన అంశం బెల్ట్ షాపుల(Belt Shops) మూసివేతకు ముందుకు వచ్చి ప్రమాణం చేసే సర్పంచ్ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్(Sanjay Das Goud) విజ్ఞప్తి పిలుపునిచ్చారు. గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాల వల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయి.

యువత చెడు మార్గాల బారిన పడుతున్నారన్నారు. సమాజంలో అనేక అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయ‌న్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా అరికట్టాలి అనేవారే నిజమైన ప్రజాప్రతినిధులు. అందుకే బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చే అభ్యర్థులకు మాత్రమే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాల‌న్నారు.

రాష్ట్రంలో తన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం కోసం బెల్ట్ షాపులను మూసివేయించిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy)ని అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం శాంతి, భద్రత(Peace, Security), అభివృద్ధి కోరుకుంటోంది.

ఈ లక్ష్యాలను సాధించడానికి బెల్ట్ షాపుల నిర్మూలన మొదటి అడుగు. సమాజం కోసం పని చేయాలనే నిబద్ధత ఉన్న, గ్రామాన్ని మద్యం సమస్యల నుంచి విముక్తి చేయాలనుకునే అభ్యర్థులను ప్రజలు ముందుకు తీసుకురావాలి కోరారు. గ్రామ అభివృద్ధికి, యువత భవిష్యత్తుకి, కుటుంబాల రక్షణకి బెల్ట్ షాపులను మూసివేస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులకే ఓటు వేయండి అని సంజయ్ దాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply